అమీషా పటేల్‌పై అరెస్ట్‌ వారెంట్ జారీ

by సూర్య | Tue, Oct 15, 2019, 01:20 AM

 తెలుగులో పవన్ కళ్యాణ్‌కు జోడీగా ‘బద్రి’, మహేష్ బాబుకు జోడీగా ‘నాని’, ఎన్టీఆర్‌కు జంటగా ‘నరసింహుడు’, బాలకృష్ణ‌కు జోడీగా  ‘పరమవీర చక్ర’ సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి అమీషా పటేల్‌పై  చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి బాధితుడు మీడియాకు చెప్పిన‌  వివ‌రాలు ఇలా ఉన్నాయి. 


 ‘ఓ సినిమా కోసం అమీషా తన బిజినెస్ పార్ట్‌నర్‌తో కలిసి నా నుంచి రూ.2.50 కోట్లు తీసుకున్నారు. 2018లో సినిమా విడుదల కావాల్సి ఉంది. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ నుంచి తీసుకున్న డబ్బును తిరిగిచ్చేస్తామని అమీషా చెప్పింది. కానీ ఆ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. దాంతో నా డబ్బు నాకిచ్చేయమని అమీషాను అడిగాను. ఆమె రూ.3 కోట్ల విలువైన చెక్ ఇచ్చింది. తీరా చూస్తే అది బౌన్స్ అయింది. అని వాపోయాడు   దీంతో ఝార్ఖండ్‌లో కేసు వేశాడు. ఆపై  దాంతో గతేడాది రాంచి డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు పెట్టాను. కోర్టు నుంచి ఎన్ని సమన్లు వచ్చినా అమీషా స్పందించింది లేదని వాపోయాడు.  తాజాగా  కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది’ అని తెలిపాడు


 నాలుగు పదుల వయసులోనూ అమీషా తన అందచందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. కానీ ఆమెకు నచ్చిన పాత్రలు రావడంలేదని కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.


 


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM