by సూర్య | Mon, Oct 14, 2019, 08:03 PM
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నటిస్తున్న స్పోర్ట్ బేస్డ్ మువీ సోమవారం ఆరంభమైంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బేనర్స్పై నారయణదాస్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ క్లాప్ నివ్వగా, సూపర్ ప్రొడ్యూసర్ దిల్రాజు కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్నిదేవుడి పటాలపై చిత్రీకరించారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి.
ఈ సందర్భంగా..
ప్రముఖ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ – సి నాగశౌర్య హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం లో నిర్మిస్తున్న ఈ సినిమా స్పోర్ట్ బేస్డ్ కథ తో రూపొందుతోంది. సినిమా అద్భుతంగా వస్తుందన్ననమ్మకముందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం” అన్నారు.
యంగ్ హీరో నాగశౌర్య మాట్లాడుతూ – ”ఏషియన్ సునీల్ గారు. శరత్ మరార్ గారి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రారంభమవడం హ్యాపీగా ఉంది. సంతోష్ సెకండ్ ఫిలిమ్. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.