నాగ శౌర్య స్పోర్ట్స్ డ్రామా ఆరంభించిన అర‌వింద్, దిల్‌రాజ్‌

by సూర్య | Mon, Oct 14, 2019, 08:03 PM

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో న‌టిస్తున్న స్పోర్ట్‌ బేస్డ్ మువీ సోమవారం ఆరంభ‌మైంది.  శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి బేనర్స్‌పై నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా    కార్యక్రమానికి ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లుఅరవింద్‌ క్లాప్‌ నివ్వగా, సూపర్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కెమెరా స్విచాన్‌ చేశారు. మొదటి సన్నివేశాన్నిదేవుడి పటాలపై చిత్రీకరించారు దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి.
ఈ సందర్భంగా..
ప్రముఖ నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ –  సి నాగశౌర్య హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం లో   నిర్మిస్తున్న ఈ సినిమా   స్పోర్ట్‌ బేస్డ్  కథ తో రూపొందుతోంది. సినిమా అద్భుతంగా వ‌స్తుంద‌న్న‌న‌మ్మ‌క‌ముంద‌ని, త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం” అన్నారు.
యంగ్‌ హీరో నాగశౌర్య మాట్లాడుతూ – ”ఏషియన్‌ సునీల్‌ గారు. శరత్‌ మరార్‌ గారి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రారంభమవడం హ్యాపీగా ఉంది. సంతోష్‌ సెకండ్‌ ఫిలిమ్‌. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్‌ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM