by సూర్య | Mon, Oct 14, 2019, 06:40 PM
టాలీవుడ్ లో 'అర్జునరెడ్డి' సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోల సరసన చేరిపోయిన విజయ్ దేవరకొండ తో తన తదుపరి చిత్రం ఉంటుందని అన్నాడు దర్శకుడు సందీప్ వంగా . . 'అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధించడం తో సందీప్ వంగా అక్కడ అవకాశాలు అందుకుంటున్నారు. అంత చక చక అయిపోయాయి. ఆ తర్వాత వెంటనే మరో బాలీవుడ్ సినిమా అవకాశం వచ్చింది సందీప్ కి. అయితే విజయ్ దేవరకొండతో మరో సినిమా ఎప్పుడు చేస్తారు.. ? అంటూ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగితే క్షణం తడుముకోకుండా ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమా తర్వాత విజయ్ తోనే చేస్తానని వెల్లడించాడు. దీంతో విజయ్ సినిమా దాదాపుగా ప్యాన్ ఇండియా ఫిలిం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబో గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Latest News