by సూర్య | Mon, Oct 14, 2019, 06:19 PM
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నసినిమా ’ఒరేయ్.. బుజ్జిగా’. ఈ చిత్ర రెండో షెడ్యూల్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ”ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభించాం. నాన్స్టాప్గా ఈ షెడ్యూల్ జరుగుతుంది. రాజ్ తరుణ్ ఎనర్జీకి తగిన క్యూట్ లవ్స్టోరీ ఇది.సెన్సిటివ్ లవ్స్టోరీ ’గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్హిట్ చిత్రాన్ని రూపొందించిన కొండా విజయ్కుమార్గారు మరో డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నంద్యాల రవి చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో వాణీవిశ్వనాథ్గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా మా ’ఒరేయ్.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్లో మరో సూపర్హిట్ సినిమా అవుతుంది” అన్నారు.
Latest News