by సూర్య | Mon, Oct 14, 2019, 02:50 PM
తమిళ స్టార్ నటుడు ధనుష్.. మంజు వారియర్ జంటగా నటించిన అసురన్ సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ధనుష్, మంజు నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఈ సినిమాను చూసిన విశ్వ నటుడు కమలహాసన్, శ్రుతిహాసన్లు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు మంజును స్వయంగా కమల్ తమ ఇంటికి ఆహ్వానించి అభినందించారు. అద్భుతంగా నటించావంటూ ఆకాశానికెత్తేశారు. మరిన్ని తమిళ చిత్రాల్లో నటించాలని ఈ సందర్భంగా కమల్ కోరారు.
Latest News