by సూర్య | Mon, Oct 14, 2019, 01:42 PM
తెలుగు రాష్ట్రాలలో మిగతా ఏరియాలలో సైరా వసూళ్లు కొంచెం నెమ్మదించినా నైజాంలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. నిన్న ఆదివారం కావడంతో సైరా విడుదలై రెండు వారాలవుతున్నా కూడా 1.17 షేర్ సాధించి సత్తా చాటింది. దీనితో సైరా నైజాంలో దాదాపు 31.4 కోట్ల షేర్ సాధించినట్లైంది. సైరా నైజాంలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలలోకి ప్రవేశించినట్లే లెక్క. ఉత్తరాంధ్రాలో కూడా సైరా లాభాలబాట పట్టింది. సైరా చిత్రంతో మెగాస్టార్ మరో మారు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. రానున్న రోజులలో పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో సైరా వసూళ్లు ఇంకొంత కాలం కొనసాగే అవకాశం కలదు. మరో రెండు వారాలలో దీపావళి రానుంది. అప్పటివరకు సైరా థియేటర్లలో కొనసాగితే మరి కొన్ని మెరుగైన వసూళ్లు రాబట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ సరసన నయనతార, తమన్నా నటించిన ఈ చిత్రంలో అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్ క్యాస్ట్ నటించారు.
Latest News