by సూర్య | Sun, Oct 13, 2019, 06:49 PM
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథా రచయితగా పని చేసిన నటుడు, దర్శకుడు వక్కంతం వంశీ గత ఏడాది అల్లు అర్జున్ హీరోగా నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని తీసాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టినా తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ దెబ్బతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మాయమైన వక్కంతం వంశీ ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. అక్కడి అగ్రహీరోల్లో ఒకరైడన దర్శన్తో త్వరలోనే ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Latest News