by సూర్య | Sun, Oct 13, 2019, 01:52 PM
అనసూయ ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అందులో భాగంగా.. విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వస్తోన్న ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది అనసూయ. ఇతర ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వాణి భోజన్ నటిస్తున్నారు. కాగా ఈరోజు ఆ సినిమాలో అనసూయ తన లుక్కు సంబందించిన ఓ పిక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ పిక్లో అనసూయ కాస్తా సీరియస్గా చూస్తూ.. ముక్కుకు పోగుతో అదరగొడుతోంది. ఈ సినిమాలో అనసూయ సామ్ పాత్రలో నటిస్తోంది. షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసిన.. ఈ. ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1న రిలీజ్ అయ్యేందుకు సిద్దం అవుతోంది.
Latest News