by సూర్య | Sun, Oct 13, 2019, 07:37 AM
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి హ్యాట్రిక్ విజయాల తర్వాత సూపర్స్టార్ మహేశ్బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2 లాంటి వరుస బ్లాక్ బస్టర్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందనా, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.ఇదిలా ఉంటే.. ప్రతి సంక్రాంతి మాదిరిగానే వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ వార్ మంచి రంజుగా మారింది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘అల వైకుంఠపురంలో’, మహేష్-అనీల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జనవరి 12 ఈ ఇద్దరూ హీరోలో ఢీ బాక్సాఫీస్ బరిలో కొట్టబోతున్నారు. వీరితో పాటు కళ్యాణ్ రామ్ కూడా ‘ఎంత మంచి వాడవురా’ అంటూ తన పందెం పుంజును రెడీ చేశారు.
Latest News