by సూర్య | Sat, Oct 12, 2019, 01:39 AM
హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్ సిస్టర్స్ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో రూపొందించిన చిత్రం సాండ్ కి ఆంఖ్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ 20 మిలియన్ల వ్యూస్ను దాటి దూసుకెళ్తోంది. తుషార్ హీరానందని దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మించిన ఈ సినమాలో తాప్సీ పన్ను, భూమి పెడ్నేకర్లు అరవైయేళ్ల బామ్మలుగా నటించారు. . దీపావళి కానుకగా విడుదలవుతోన్న ఈ చిత్రానికి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం శుక్రవారం ట్విట్టర్లో ప్రకటించింది.
Latest News