by సూర్య | Sat, Oct 12, 2019, 12:20 AM
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని హీరో నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి కథగా వస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మంచి ఫీల్ గుడ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిజానికి శేఖర్ కమ్ముల ఈ సినిమాని డిసెంబర్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేసినా కూడా షూటింగ్ ఇంకా బాలన్స్ ఉండడంతో టైం తీసుకోని క్వాలిటీ ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. జనవరిలో పెద్ద సినిమాల విడుదల ఉండడం, పైగా ఇది మంచి ప్రేమ కథ కావడంతో వాలెంటైన్స్ డే నాడు రిలీజ్ చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు నిరాయించారని తెలుస్తోంది. ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది.
Latest News