కేరళ సీరియల్ కిల్లింగ్స్‌పై మాలీవుడ్‌లో రెండు సినిమాలు

by సూర్య | Fri, Oct 11, 2019, 02:11 AM

పోలీసులకు సైతం దిగ్భ్రాంతి కలిగించేలా, చెమటలు పట్టించేలా  జాలీ థామస్ సాగించిన హత్యల తీరు  ఓ థ్రిల్లర్ సినిమాగా తెర‌కెక్కించేందుకు మ‌ళ‌యాళీ చిత్ర ప‌రిశ్ర‌మ ర‌డీ అయిపోతోంది. ఒక‌టి కాదు రెండు చిత్రాలు ఇదే నేప‌థ్యంలో జ‌ర‌గ‌నుండ‌టం విశేషం. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో  ఆంటోని పెరంబవూర్ నిర్మించనున్నఈ సినిమా లో మోహన్ లాల్ నటించబోతున్నారు. జాలీ థామస్ హత్యలపై ఆరా తీయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు నాయకత్వం వహిస్తోన్న కోజికోడ్ రూరల్ ఎస్పీ సిమోన్ పాత్రను మోహన్ లాల్ పోషిస్తున్నారు.  ఈ హత్యలన్నీ కూడతై ప్రాంతం చుట్టే తిరగడంతో ఈ సినిమాకు `కూడతై` అనే పేరు పెట్టారు. 
కాగా  రోనెక్స్ ఫిలిప్ దీనికి దర్శకత్వంలో మాలీవుడ్ ప్రముఖ నిర్మాత అలెక్స్ జాకబ్ మ‌రో  సినిమాను నిర్మించనున్నారు.  జాలీ థామస్ పాత్రను త‌ను పోషిస్తున్న‌ట్టు న‌టి  డినీ డేనియల్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కోలపథకొంగలుడే ఒన్నారు పథిటండు..` పేరుతో ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మ‌రి ఈ రెండూ ఎలాంటి విజ‌యాల‌ను అందుకుంటాయో చూడాలి.


 


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM