by సూర్య | Fri, Oct 11, 2019, 01:22 AM
సూరి, నైనా జంటగా నటించిన చిత్రం బ్యూటిపుల్. ట్రైలర్ కుర్రకారుని కట్టి పడేస్తోంది. ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ఉపశీర్షికతో విడుదలైన ఈ చిత్రానికి లక్ష్మీస్ ఎన్టీఆర్కు పనిచేసిన అగస్త్య మంజు దర్శకుడు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్పై టి.నరేష్కుమార్, శ్రీధర్ లతో కలిసి రాంగోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని లేబ్ వర్క్లో ఉంది. ఈ సినిమా ట్రైలర్ను బుధవారం విడుదల చేయగా యూట్యూబ్లో ఊహించనని లైకులు పడుతున్నాయి. గతంలో వర్మ తీసిన రంగీలా సినిమా తరహాలోనే అగస్త్య కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు ఈ సినిమాకు ట్రిబ్యూల్ టూ రంగీలా అని ట్యాగ్ ఎందుకు పెట్టారో చెప్పకనే ట్రయిలర్లోచెప్పేసినట్టుందట. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కుర్రకారు ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారనటానికి ట్రైలర్కివస్తున్న లైకులే నని, ఇది మరింత ఉత్సాహం ఇస్తోందంటున్నారు. నిర్మాతలు. మరి ఈ బ్యూటిఫుల్ రంగీలా స్ధాయిలో యువతరాన్ని ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.
Latest News