by సూర్య | Thu, Oct 10, 2019, 02:01 PM
హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను సినీ నటి సాయిపల్లవి స్వీకరించారు. దీనిలో భాగంగా సాయిపల్లవి మొక్కలు నాటారు. భూగోళంలో వాయు కాలుష్యం పెరుగుతుందని, దానికి మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైన ఉందని, ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని, దానికి ఇదే మంచి తరుణమని ఈ సందర్భంగా ట్విట్ చేశారు. తనకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన వరుణ్తేజ్కు కృతజ్ఞతలు తెలిపారు. తాను కూడా సమంతా, రాణా దగ్గుబాటికి మొక్కలు నాటాలని నామినేట్ చేసినట్లు ట్విట్లో పేర్కొన్నారు.
Latest News