by సూర్య | Thu, Oct 10, 2019, 09:09 AM
కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చే అగ్ర కథానాయకుడు మహేశ్బాబు .షూటింగ్కు కాస్త విరామం దొరికితే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తారు. ఈమధ్య దసరా నాడు ‘సరిలేరు నీకెవ్వరు’ పోస్టర్కు అభిమానుల నుంచి వచ్చిన స్పందనకు ధన్యవాదాలు తెలిపిన ఆయన తాజాగా కుటుంబంతో కలిసి దిగిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇందులో ఒకే కుర్చీలో మహేశ్బాబు, గౌతమ్, సితార ముందు కూర్చొని ఉండగా, వెనుకవైపు నమ్రత నిలబడి ఉన్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.
Latest News