by సూర్య | Thu, Oct 10, 2019, 09:04 AM
ఇప్పటికే మరాఠీలో నిర్మించిన ఓ సినిమాలో నటించిన జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా టాలీవుడ్ లోకి తీసుకురావాలని ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని ఫిలింనగర్ టాక్. పవన్ కల్యాణ్ సినిమాలకు స్వస్తి చెప్పి, పూర్తి రాజకీయాల్లో నిమగ్నమైన క్రమంలో తన తనయుడు అకీరాను తెలుగు తెరకు పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాలీవుడ్ లో వార్తలు బలంగా విన వస్తున్నాయి.
తొలుత అకీరా నటించిన మరాఠీ చిత్రాన్ని తెలుగులోకి డబ్బ్ చేయాలని మొదట భావించినా,డబ్బింగ్ సినిమాతో కాకుండా నేరుగా టాలీవుడ్ లో అకీరాను లాంచ్ చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అకీరా టాలీవుడ్ ప్రవేశం చేస్తారని, కొణిదెల ప్రొడక్షన్ లోనే ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి, మరి ఈ వార్తలెంతవరకు నిజమో చూడాలి.
Latest News