ప‌వ‌న్‌తో సై అన్న చిరు- అబ్బే అదేంలేద‌న్న జ‌న‌సేన‌

by సూర్య | Wed, Oct 09, 2019, 10:13 PM

తాను రాజ‌కీయాల్లోనే కొన‌సాగుతాన‌ని 2024 ఎన్నిక‌లే త‌న ప్ర‌ధాన ల‌క్ష్యం అని ప‌వ‌న్ ప‌దే ప‌దే చెప్ప‌క‌నే చెబుతున్నారు. సినిమాల వైపు రావాలన్న నిర్ణ‌యాన్ని ప‌వ‌న్ ఎప్పుడూ ఏ వేదికపైనా ప్ర‌క‌టించిందేం లేదు. అయితే  సైరా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ కామెంట్ ప‌వ‌న్ తిరిగి సినిమాల్లోకి రాబోతున్నార‌న్న సంకేతాలు ఇచ్చింది. దాంతో మ‌రోసారి దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చకు తెర‌లేపింది.


నా బిడ్డ  రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా చేసేందుకు ఎంత ఆస‌క్తిగా ఉంటానో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ సినిమా చేసేందుకు అంతే ఆస‌క్తిగా ఉంటాను. నేను-ప‌వ‌న్ క‌లిసి న‌టిస్తామంటే రామ్ చ‌ర‌ణ్ సిద్ధంగానే ఉన్నాడు.. అంటూ చిరు వ్యాఖ్యానించడంతో ప‌వ‌ర్ స్టార్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నార‌ని ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.   ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉన్నా సినిమాల్లోకి రావాల్సిందేన‌ని చిరు ప‌ట్టుబ‌డుతున్నారా? అందుకు ప‌వ‌న్ కూడా సై అనేశారా?  అనే సందేహం తెలుగు  ప్రేక్ష‌కుల్లోనే కాదు ప‌వ‌న్ అభిమానుల్లోనూ క‌నిపిస్తోంది. 


మ‌రోవైపు జ‌న‌సేన వ‌ర్గాలు మాత్రం పవ‌న్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న క‌థ‌నాలు కొట్టి పారేస్తు,  ఇవి కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మే అని చెపుతున్నాయి.  


 


 

Latest News
 
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 02:25 PM
'రత్నం' సింగల్ షాట్ మేకింగ్ వీడియో రిలీజ్ కి టైమ్ లాక్ Thu, Apr 25, 2024, 02:22 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM