by సూర్య | Tue, Oct 08, 2019, 12:46 AM
దసరా పండగ సందర్భంగా టాలీవుడ్ కి చెందిన కొందరు హీరోలు తమ పోస్టర్స్ రిలీజ్ చేసి, తమ అభిమానులకు దసరా పండగ శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. ఈక్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా పోస్టర్ సోమవారం విడుదలైంది. కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు సాక్షిగా అన్నట్లు మహేష్ వీరావేశంతో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. మహేష్ కెరీర్ ని మలుపు తిప్పిన ఒక్కడు సినిమాలో కొండారెడ్డి బురుజు సీన్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుందని సినీ వర్గాలంటున్నాయి.
Latest News