by సూర్య | Mon, Oct 07, 2019, 01:22 AM
నటుడిగా దర్శకుడిగా తనదైన మార్కుతో విజృంభించే రవిబాబు తనకంటూ ఇప్పటికే ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు . ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఆవిరి`. ఈ చిత్రంలో ఆమనతో పాటు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన తారాగణం కాగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్పై ఈ సినిమా నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఆదివారం దర్శక నిర్మాత రవిబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ``రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్కు ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నాం. సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా,థ్రిల్లింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది`` అన్నారు, కాగా `అల్లరి`, `నచ్చావులే`, `అనసూయ`, `అవును`, `అవును 2` ..వంటి పలు చిత్రాల చిత్ర జయ పరాజయాలు ఎలా ఉన్నా దర్శకుడుగా రవిబాబు తనదైన ట్రేడ్ మార్కును ఏర్పాటు చేసుకున్నాడు.
Latest News