by సూర్య | Mon, Oct 07, 2019, 12:30 AM
. రోవాస్కైర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్.రెడ్డి సంయుక్తంగా బాలాజీ సానల దర్శకత్వంలో రూపొందిన చిత్రం "ఊరంతా అనుకుంటున్నారు సక్సెస్ మీట్ని ఆదివారం జరిగింది. నవీన్ విజయ్ కృష్ణ, మేఘానా చౌదరి, శ్రీనివాస్ అవసరాల, సోఫియా సింగ్ హీరోహీరోయిన్లుగా దసరా పండుగని పురస్కరించుకుని ఈ శనివారం విడుదలైన సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్ననేపథ్యంలో జరిగిన ఈ సక్సస్ మీట్లో నిర్మాత శ్రీహరి మంగళంపల్లి మాట్లాడుతూ, "సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. "సైరా' లాంటి పెద్ద సినిమా వల్ల . థియేటర్ల కొరత కారణంగా కాస్త ఇబ్బంది ఏర్పడింది అన్నారు. చూసినవాళ్ళు సినిమా చాలా బాగుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉందని చెపుతున్నారని ఇది తమకు ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో థియేటర్లు పెరుగుతాయి. మల్టీఫెక్స్ లు పెరుగుతాయని చెప్పారు.
మరో నిర్మాత పి.ఎల్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ, "పల్లెటూరు సాంప్రదాయాలను, కట్టుబొట్టు, గ్రామమంతా ఓ కుటుంబంలా ఎలా కలిసి ఉంటుంది. సమస్య వస్తే ఎలా పరిష్కరించుకుంటారనే విషయాలను, విలువలని ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశాం. సినిమా మంచి ఫలితాన్ని అందుకుందని చెప్పారు. ఈ కార్య్రక్రమంలో మరో నిర్మాత రమ్య గోగుల పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఈకార్యక్రమంలో చిత్ర దర్శకుడితో పాటు నటీనటులు పాల్గొని తమ ఆనందాలను వ్యక్తం చేసారు.
Latest News