బిర్యానీ విందును ఆస్వాదించిన రామ్ చరణ్

by సూర్య | Tue, Jan 06, 2026, 06:20 PM

స్టార్ హీరో రామ్ చరణ్ ఇటీవల కుటుంబంతో కలిసి ప్రత్యేక బిర్యానీ విందును ఆస్వాదించారు. ఆయన నివాసంలో ప్రముఖ జపనీస్ చెఫ్ ఒసావా టకమసా కుండ బిర్యానీ వండి రుచి చూపించారు. 15 ఏళ్ల అనుభవం కలిగిన ఒసావా సింగిల్ పాట్ బిర్యానీలో నిపుణుడిగా పేరొందారు.తక్కువ గ్రేవీతో, అద్భుతమైన సువాసనతో వండిన బిర్యానీని చరణ్, ఆయన తల్లి సురేఖ, అర్ధాంగి ఉపాసనతో పాటు ఇతర కుటుంబ సభ్యులంతా ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది'లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదలకు సిద్ధమవుతోంది. 

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM