|
|
by సూర్య | Fri, Dec 05, 2025, 07:49 PM
ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మొసళ్లతో నిండిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను విలువలతో రాజీ పడకుండా నిజాయితీగా ఉంటానని, అవకాశాల కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకోనన్నారు. యూకేలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో 42 రోజుల పాటు సినిమా కోసం కష్టపడి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. భూషణ్ కుమార్ తో విడాకుల వార్తలపై స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని, మీడియా మాత్రం అది నిజం కావాలని కోరుకుంటుందన్నారు.
Latest News