|
|
by సూర్య | Fri, Oct 17, 2025, 07:34 PM
మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్లో తదుపరి చిత్రం 'థామా' లో ఆయుష్మాన్ ఖుర్రానా మరియు రష్మికా మాండన్న ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 21, 2025న విడుదల కానుంది. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 'U/A 16+' సర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. పరేష్ రావల్ మరియు నవాజుద్దీన్ సిద్దికి ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని నైరెన్ భట్, అరుణ్ ఫ్యులారేరా మరియు సురేష్ మాథ్యూ రాశారు. ఈ ప్రాజెక్టును మాడాక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Latest News