ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు

by సూర్య | Mon, Aug 15, 2022, 11:09 PM

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ‌్య పొలిటికల్ వార్ ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. ఆ వార్ ఛాయలు రాజ్ భవన్ లో సైతం స్పష్టంగా కనిపించాయి. విజయవాడలోని రాజ్ భవన్ లో ఇవాళ ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆతిథ్యమిచ్చారు. గవర్నర్ ఆహ్వానం అందుకుని ఎట్ హోమ్ కు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు దూరం దూరంగానే ఉన్నారు. ఎక్కడా ఒకరికొకరు ఎదురుపడలేదు. సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్ గవర్నర్ తో కలిసి ఓ టేబుల్ వద్ద కూర్చోగా, టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు మరో టేబుల్ వద్ద కూర్చున్న దృశ్యాలు కనిపించాయి.  


అసెంబ్లీలో తప్ప జగన్, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదైన విషయం. దాంతో మీడియా దృష్టంతా ఈ ఎట్ హోమ్ కార్యక్రమంపైనే నిలిచింది. అయితే వీరిద్దరూ పరస్పరం ఎదురుపడకుండానే కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి ఏపీ మంత్రుల్లో పలువురు హాజరయ్యారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM