సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు

by సూర్య | Mon, Aug 15, 2022, 11:08 PM

ఏపీలో పలువురు ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారి సత్ప్రవర్తన గుర్తించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి మొత్తం 175 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ముందే విడుదలైన వారిలో జీవితఖైదు పడిన 48 మంది ఖైదీలు కూడా ఉన్నారు. ఇదిలావుంటే సత్ప్రవర్తన కారణంగా విడుదలైన ఖైదీల్లో అత్యధికులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందినవారే. రాజమండ్రి జైలు నుంచి 66 మంది విడుదల కాగా, వారిలో 55 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 40 మంది విడుదలయ్యారు. వారిలో 33 మంది జీవితఖైదు పడినవారే. ఇక, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి 25 మంది ఖైదీలు ప్రభుత్వ నిర్ణయంతో విముక్తి పొందారు. ఇదిలావుంటే జైల్లో కనబర్చిన సత్ప్రవర్తననే బయట కూడా కనబర్చాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఉపశమనాన్ని రద్దు చేస్తామని ఖైదీలకు అధికారులు స్పష్టం చేశారు.

Latest News

 
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM
తెనాలిలో కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి Thu, Mar 28, 2024, 01:51 PM