పిచ్చోడి చేతికి ఏకే47 ఇచ్చినట్టుంది ఏపీ పాలన: ఎన్.తులసిరెడ్డి

by సూర్య | Mon, Aug 15, 2022, 09:47 PM

మూడేళ్ల వైసీపీ పాలన చాలా దారుణంగా ఉందని... పాలనను చూస్తే పిచ్చోడి చేతికి ఏకే47 ఇచ్చినట్టుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.. శ్రీలంక కంటే ఏపీలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం లేదని... సంక్షేమాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు.


 వైసీపీని రాసలీలల పార్టీ అనాలా, కామాంధుల పార్టీ అనాలా, దిగంబర పార్టీ అనాలా అని ప్రశ్నించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పాదయాత్రను నిర్వహించింది. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రారంభమైన పాదయాత్ర బంగారుపాళ్యం, చిత్తూరు వీదుగా గంగాధరనెల్లూరు వరకు కొనసాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest News

 
9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బొత్సను ఢీకొట్టేది ఆయనే Fri, Mar 29, 2024, 07:30 PM
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత గుడ్‌ బై.. రేపో మాపో సొంతగూటికి! Fri, Mar 29, 2024, 07:26 PM
బూడిద ఇచ్చే 'బూడి' కావాలా.. అభివృద్ధి ఇచ్చే మోదీ కావాలా?.. సీఎం రమేష్ Fri, Mar 29, 2024, 07:23 PM
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM