ఢిల్లీలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ

by సూర్య | Sat, Aug 06, 2022, 03:51 PM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబును కేంద్రం ఆహ్వానించడం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. 


ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు ఎంతో ఉల్లాసంగా కనిపించారు. ఎంపీలతో ఛలోక్తులు విసురుతూ, నవ్వుతూ సరదాగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పంచుకుంది.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM