by సూర్య | Sat, Aug 06, 2022, 03:51 PM
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబును కేంద్రం ఆహ్వానించడం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు ఎంతో ఉల్లాసంగా కనిపించారు. ఎంపీలతో ఛలోక్తులు విసురుతూ, నవ్వుతూ సరదాగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Latest News