by సూర్య | Sat, Aug 06, 2022, 02:20 PM
ఆసుపత్రికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి అదృశ్యమైన మహిళ మృతదేహం పి. గన్నవరం గోదావరిలో శుక్రవారం లభ్యమైయిందని హెడ్ కానిస్టేబుల్ వి. జి. వి. వరప్రసాద్ తెలిపారు. అంబాజీపేట మండలంలోని గంగలకుర్రుకు గ్రామానికి చెందిన వేజర్ల నాగమణి(45) ఈ నెల 2న భీమవరం ఆసుపత్రికి వెళుతున్నానని కుటుంబ సభ్యులతో చెప్పి వెళ్లిందని, అయితే ఆమె అప్పటినుండి కనబడకపోవడంతో ఆమె కుమార్తె శ్రీహర్ష పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. శుక్రవారం నాగమణి మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రసాద్ చెప్పారు.
Latest News