by సూర్య | Sat, Aug 06, 2022, 02:18 PM
అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డ రెండు ద్విచక్ర వాహనాలను శనివారం భీమిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) స్టేషనులో వేలం వేస్తున్నారు. గొలుసు దుకాణాల ద్వారా మద్యం అమ్మ కాలను నిరోధించేందుకు సెబ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పట్టుబడిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇటీవల ఈ విధంగా సీజ్ చేసిన రెండు వాహనాలను సెబ్ స్టేషన్ ఆవరణలో శనివారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేస్తామని ఎస్ఐ డి. పద్మావతి తెలిపారు.
Latest News