by సూర్య | Sat, Aug 06, 2022, 02:14 PM
అచ్యుతాపురం మండ లంలోని ఎం. జగన్నాథపురం గ్రామానికి చెందిన మడిశా చిట్టిబాబు(30) విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వ్యవసాయ రైతు అయిన చిట్టిబాబు జూలై 12న పొలం పనులు చేసుకొని గడ్డి మోపు మోసుకొంటూ వస్తుండగా జారి రాయిపై పడిపోయాడు. దీంతో కాళ్లు, చేతులు చచ్చుబడి పోయాయని, ముందుగా అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, తర్వాత విశాఖ ఆస్పత్రికి తరలించగా, శుక్రవారం మృతి చెం దారని మృతుని భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చిట్టిబాబు మృతితో జగన్నాథపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Latest News