పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య

by సూర్య | Sat, Aug 06, 2022, 01:59 PM

పురుగులు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి లక్కవరపుకోట సబ్ ఇన్స్పెక్టర్ ఎం. ముకుందరావు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వనాథ వెంకన్న (41) తమ కుటుంబంతో కలసి లక్కవరపుకోట మండల కేంద్రంలో నివాసముంటున్నాడు.


ఇటీవల వెంకన్న అనారోగ్యం బారిన పడటంతో పాటుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం తన ఇంట్లో ఉన్న పురుగులు మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంకన్నను హుటాహుటిన విశాఖపట్నం కెజిహెచ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వెంకన్న మృతి చెందాడు. మృతుడి కుమార్తె సత్యవేణి ఫిర్యాదు మేరకు లక్కవరపుకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
నేడు చంద్రబాబు పుట్టిన రోజు Sat, Apr 20, 2024, 11:51 AM
రెండో రోజు నాలుగు నామినేషన్లు Sat, Apr 20, 2024, 10:49 AM
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత Sat, Apr 20, 2024, 10:41 AM
పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష Sat, Apr 20, 2024, 10:40 AM
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM