by సూర్య | Sat, Aug 06, 2022, 01:40 PM
సంతనూతలపాడు: మండలంలోని వ్యవసాయ రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా పొందాలంటే, ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పంటలను తప్పక పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి రమణ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పంటలకు గ్రామ విఆర్డీ, వ్యవసాయ సహాయకులు, సర్వేయర్ల ఆధ్వర్యంలో పంట నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 31 లోగా మండలంలోని రైతులందరూ పూర్తి చేసుకోవాలన్నారు.
Latest News