by సూర్య | Sat, Aug 06, 2022, 01:25 PM
తుగ్గలి: వారం క్రితం నిశ్చితార్థం అయింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉన్న ఆ ఇంట్లో వరుడు గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకెళితే తుగ్గలి మండలం పెండేకల్లు ఆర్ఎస్ కు చెందిన పోస్టుమెన్ రంగన్న కుమారుడు వీరప్రసాద్ (27) ఎస్బీఐ సర్వీసు పాయింట్ పెట్టుకొని తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నాడు. అయితే శుక్రవారం వీరప్రసాద్ కు ఉన్నట్లుండి గుండె పోటు రావడంతో మృతి చెందాడు.
Latest News