రుణాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:22 PM

చేబ్రోలు పోలీస్ స్టేషన్లో శనివారం ఎస్సై వై. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం వడ్లమూడి గ్రామానికి చెందిన కొల్లా లక్ష్మీ సౌజన్య విజ్ఞాన్ కళాశాలలో పనిచేస్తున్నారు. ఇదే కళాశాలలో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న గౌరీ శంకర్ ద్వారా రంగారెడ్డి పరిచయం అయ్యాడు. బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని జగనన్న బ్యాంకు లోన్ ద్వారా 6 లక్షల రూపాయలు ఇప్పిస్తానని అందులో మూడు లక్షల వరకు రాయితీ ఉందని నమ్మించాడు. అతను మాటలను నమ్మి ఆమెతోపాటు గ్రామంలోని కొంతమంది మహిళలు కలిసి అతనికి 3. 73 లక్షలు ఇచ్చారు. ఎంతకీ లోన్లు ఇప్పించకపోవడంతో తాము మోసం పోయమని గమనించి శుక్రవారం రాత్రి చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో లక్ష్మీ సౌజన్య ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM