by సూర్య | Sat, Aug 06, 2022, 12:50 PM
ఇరాన్లో ఇక నుంచి ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఆ దేశ సాంస్కృతిక శాఖ నిషేధం విధించింది. మహిళలు ఐస్క్రీం తింటున్నట్టుగా ఇటీవల విడుదలైన రెండు ప్రకటనలు ఇరాన్లో తీవ్ర దుమారం రేపాయి. అందులో హిజాబ్ను నిర్లక్ష్యం చేశారని, మహిళలను అభ్యంతరకర రీతిలో చూపెట్టారని అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు సాంస్కృతిక శాఖ లేఖ రాసింది. దీంతో ఇకపై ఎలాంటి ప్రకటనల్లో నటించడానికి మహిళలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
Latest News