ప్రేమ జంట ఆత్మహత్య

by సూర్య | Sat, Aug 06, 2022, 12:11 PM

అనంతపురం జిల్లా,  బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయరులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విషాద ఛాయలు మిగిల్చింది. వివరాల్లోకి వెళ్ళితే ... ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన ఎజిత(16), బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన అజయ్‌(19) మృతదేహాలను శుక్రవారం సాయంత్రం జీడిపల్లి రిజర్వాయరులో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహాలను వెలికితీయడం సాధ్యం కాలేదు. శనివారం ఉదయం వెలికితీశారు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి.. సమగ్ర దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని బెళుగుప్ప ఎస్‌ఐ రుషేంద్రబాబు తెలిపారు.

Latest News

 
నారా లోకేశ్ కాన్వాయ్‌లో రూ.8 కోట్ల క్యాష్ దొరికిందా..? వైరల్ అవుతోన్న వీడియోలో నిజమెంత. Fri, Mar 29, 2024, 07:48 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు Fri, Mar 29, 2024, 07:44 PM
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన అలర్ట్.. అటు వైపు వెళ్లొద్దని హెచ్చరిక Fri, Mar 29, 2024, 07:39 PM
నాలుగో లిస్ట్ ఎఫెక్ట్.. చీపురుపల్లిలో టీడీపీకి బిగ్ షాక్ Fri, Mar 29, 2024, 07:34 PM
9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బొత్సను ఢీకొట్టేది ఆయనే Fri, Mar 29, 2024, 07:30 PM