by సూర్య | Sat, Aug 06, 2022, 12:11 PM
అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయరులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విషాద ఛాయలు మిగిల్చింది. వివరాల్లోకి వెళ్ళితే ... ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన ఎజిత(16), బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన అజయ్(19) మృతదేహాలను శుక్రవారం సాయంత్రం జీడిపల్లి రిజర్వాయరులో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహాలను వెలికితీయడం సాధ్యం కాలేదు. శనివారం ఉదయం వెలికితీశారు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి.. సమగ్ర దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని బెళుగుప్ప ఎస్ఐ రుషేంద్రబాబు తెలిపారు.
Latest News