by సూర్య | Sat, Aug 06, 2022, 10:35 AM
ఎన్ . టి. ఆర్ పోలీస్ కమిషనరేట్ లో ప్రతి శుక్రవారం జరిగే " డయల్ యువర్ సి.పి " కార్యాక్రమంలో భాగంగా పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్శిపేట ప్రాంతంలో కొంత మంది యువకులు రాత్రి సమయంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని మరియు ఆ ప్రాంత ప్రజలను ఇబ్బంది కలిగిస్తున్నారని బాధ్యత గల వ్యక్తి ఫిర్యాదు చేయగా , వెంటనే స్పందించి పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ను ఆ ప్రాంతాల్లో తిరుగుతూ , బహిరంగంగా మద్యం సేవించే వారి పై చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీ విశాల్ గున్ని IPS డీసీపీ ( L&O- East) గారు సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
Latest News