ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలు అసత్య ప్రచారం: సోమువీర్రాజు

by సూర్య | Sat, Aug 06, 2022, 04:13 AM

చంద్రబాబే మోసం చేశారు కానీ బీజేపీ ఎప్పుడూ మాట తప్పలేదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిధుల కోసం ఒక మాట, నిధులు అందాక మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సుజనా చౌదరి చేసిన విజ్ఞప్తి వల్లే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారని సోము వీర్రాజు వెల్లడించారు. పోలవరంపై సుజనా చౌదరి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని కలిశారని వివరించారు.  


చంద్రబాబే మోసం చేశారు కానీ బీజేపీ ఎప్పుడూ మాట తప్పలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నా, మోదీ ఏపీ అభివృద్ధికి నిధులు ఇచ్చారని వెల్లడించారు. అయినా రాజధాని అభివృద్ధి చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ఉపయోగించింది నిజం కాదా? అని నిలదీశారు. మళ్లీ ప్రత్యేక హోదా అని ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. మరొక ఆయన మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ విమర్శించారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం ఏమిటి? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని అభివృద్ధికి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 


ఏపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, దండుకోవడమే ఈ రెండు పార్టీల పని అని వెల్లడించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కమ్యూనిస్టులు పాదయాత్ర చేస్తామని అంటున్నారని, వారు ఎప్పుడు ఎవరితో కలిసి నడుస్తారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు.

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM