పార్టీ గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయండి: వై.ఎస్.జగన్ పిలుపు

by సూర్య | Sat, Aug 06, 2022, 04:08 AM

2024 ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వైసీపీ శ్రేణుల‌తో స‌మావేశాల్లో భాగంగా శుక్ర‌వారం ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రాజాం నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఈ భేటీకి రాజాం నుంచి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న వైసీపీ నేత కంబాల జోగులుతో పాటు ఆ నియోజ‌కవ‌ర్గానికి చెందిన 50 మంది పార్టీ కీల‌క నేత‌లు హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా 2024 ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని జ‌గ‌న్ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. కంబాల జోగులును మ‌రోమారు గెలిపించాల‌ని ఆయ‌న సూచించారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి మరింత మేర నిధులు మంజూరు చేయ‌నున్న‌ట్లు జ‌గ‌న్ తెలిపారు. ఈ త‌ర‌హా భేటీల్లో భాగంగా గురువారం కుప్పం నియోజ‌కవ‌ర్గ నేత‌ల‌తో జ‌గ‌న్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM