తైవాన్..చైనా మధ్య కమ్ముకొన్న యుద్ద మేఘాలు

by సూర్య | Sat, Aug 06, 2022, 03:43 AM

ఉక్రెయిన్, రష్య యుద్దం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారితే తాజాగా తైవాన్, చైనా మధ్య యుద్దానికి దారితీస్తున్న పరిస్థితులపై చర్చ సాగుతోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనపై చైనా ఒంటికాలిపై లేస్తోంది. తైవాన్‌లో పెలోసీ అడుగుపెడితే అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డ్రాగన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. చైనా ప్రకటనలను బేఖాతరు చేస్తూ పెలోసీ తైవాన్‌లో కాలుమోపారు. దీంతో ఆమె తైపీలో అడుగుపెట్టిన వెంటనే డ్రాగన్‌ లైవ్‌ ఫైర్‌ మిలిటరీ డ్రిల్స్‌ను ప్రారంభించింది. తైవాన్‌కు సమీపంలో భారీగా ఆయుధాలను మోహరించింది. తైవాన్ గగనతల రక్షణ జోన్‌లోకి 20కిపైగా యుద్ధ విమానాలు పంపింది. ఆమె పర్యటన ముగిసి 24 గంటలు గడవకు ముందే చైనా దూకుడు పెంచింది.


తాజాగా, తైవాన్ సమీపంలో గురువారం మధ్యాహ్నం చైనా మిలటరీ లైవ్-ఫైర్ డ్రిల్‌ను ప్రారంభించినట్టు ఆ దేశ అధికారిక మీడియ చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) పేర్కొంది. ‘‘గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించి ఆగస్టు 7 మధ్యాహ్నం 12 గంటల వరకూ ముఖ్యమైన మిలటరీ డ్రిల్‌ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నిర్వహిస్తోంది’’ అని తైవాన్ మ్యాప్‌తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే సమయంలో తాజా పరిణామాలపై తైవాన్ సైన్యం స్పందిస్తూ.. యుద్ధం కోరుకుండానే పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలిపింది.


తమ ప్రాదేశిక జలాల చుట్టుపక్కల గతంలో ఎన్నడూ లేనివిధంగా యుద్ధం సన్నాహంతో చైనా చేపట్టిన మిలటరీ డ్రిల్‌ను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది. ‘‘వివాదం పరిష్కారానికి యుద్ధాన్ని కోరకుండానే యుద్ధానికి సిద్ధమయ్యే సూత్రాన్ని సమర్థిస్తుందని జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ నొక్కిచెప్పింది’’ అని తైవపీ మిలటరీ ఓ ప్రకటన విడుదల చేసింది.


ఇదిలావుంటే తైవాన్‌ అధ్యక్షురాలితో భేటీ అనంతరం పెలోసీ మీడియాతో మాట్లాడారు. తైవాన్‌ను తాము ఒంటరిగా వదిలేయబోమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి అమెరికా మద్దతు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. దాన్ని స్పష్టంగా చెప్పేందుకే తాను ఇక్కడికి వచ్చానని, తైవాన్‌లో స్వయంపరిపాలనకు తాము సంఘీభావంగా ఉంటామని స్పష్టం చేశారు.


ఇప్పటికే పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్‌పై చైనా పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తైవాన్‌ నుంచి చేపలు, పండ్ల దిగుమతిని నిషేధించింది. వాటిల్లో అధిక పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని ఆరోపించింది. ఇక నిల్వచేసిన చేపల్లో కరోనా వైరస్‌ ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. దీంతోపాటు తైవాన్‌కు చైనా నుంచి ఎగుమతయ్యే ఇసుకపై కూడా నిషేధం విధించింది.


 

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM