ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన వారికే బార్లు దక్కాయి: బొండా ఉమ

by సూర్య | Sat, Aug 06, 2022, 03:39 AM

ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన వారికే బార్లు దక్కాయని.. విజయవాడలో 111 బార్లకు 109 టెండర్లు మాత్రమే పడ్డాయి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఏపీలో బార్ల లైసెన్సింగ్ ప్రక్రియ అనేది ఓ ఫాల్స్ అని ఆయన అన్నారు.  మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి బార్ల లైసెన్సుల విషయంలో సిండికేట్ అయ్యారన్నారు. మంత్రి జోగి రమేష్‌కు మద్యం సిండికేట్ల నుంచి రూ.20 కోట్లు దక్కాయి అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బార్ల లైసెన్సుల ప్రక్రియను ఫాల్స్‌గా మార్చారన్నారు. తాడిగడప, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో అప్ సెట్ ధర కంటే చాలా ఎక్కువగా బిడ్లు వేశారన్నారు.


విజయవాడలో మాత్రం అప్ సెట్ ధర రూ.50 లక్షలుగా ఉంటే.. ఆ ధరకే బార్లు దక్కించుకున్నారన్నారు. తాడిగడపలో అప్ సెట్ ధర కంటే రూ.70 లక్షల మేర ఎక్కువగా వచ్చిందన్నారు. తాడిగడప, తాడేపల్లి వంటి చోట్ల వచ్చిన ధర విజయవాడలో ఎందుకు రాలేదని.. ఎక్సైజ్ సిబ్బంది కూడా ముడుపులు పంచుకున్నారన్నారు. సిండికేట్ కావడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ధర రాకుండా పోయిందన్నారు. రూ.50 లక్షలు తనకు ఇప్పించండి.. విజయవాడలో ఉన్న 100 బార్లు తీసుకుంటాను అన్నారు.


అప్ సెట్ ధర కంటే ఎక్కువగా రాని మద్యం బార్ల లైసెన్సులను రద్దు చేయాలన్నారు ఉమా. బార్ల లైసెన్సింగ్ విధానం పై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలన్నారు. బార్ల లైసెన్సుల ప్రక్రియ స్వేచ్ఛగా జరిగితే 111 బార్లకు గానూ 500 దరఖాస్తులు వచ్చేవి అని చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా మంత్రికి విజయవాడలో 5 బార్లు ఇచ్చారని.. చిత్తూరు జిల్లా నుంచి విజయవాడ వరకు 17 బార్లను ఆ మంత్రికి కట్టబెట్టారన్నారు. చిత్తూరు జిల్లా మంత్రి అనుచరులు బార్ల లైసెన్సుల ప్రక్రియను దగ్గరుండి మానిటరింగ్ చేశారన్నారు. సంబంధిత శాఖ మంత్రికే మద్యం బార్లు కట్టబెట్టారని ఆరోపించారు.


ఏపీని జగన్ మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు బొండా. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు .. టీచర్లతో మద్యం అమ్మించారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలే మద్యం వ్యాపారంలో మునిగి తేలుతున్నారన్నారు. డిస్టలరీలన్నింటినీ సీఎం జగన్, విజయసాయి రెడ్డి వంటి వారు చేజిక్కించుకున్నారని.. అధికార పార్టీ పెద్ద బ్యాచ్ రూ.15 మద్యాన్ని ఏపీ బేవరేజేస్ కు 200 రూపాయలకు అమ్ముతున్నారని విమర్శించారు. డిస్టలరీల నుంచి ఏపీ బేవరేజేస్ ఎంతకు కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా ఇవ్వడం లేదన్నారు.


ఏపీలోని 3200 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ మనీని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. రోజుకు సుమారుగా రూ.300 కోట్ల మేర నగదు ప్రభుత్వానికి కరెన్సీ రూపంలో సమకూరుతోందన్నారు. ఈ మద్యం కరెన్సీలో తాడేపల్లి ప్యాలెస్సుకు చేరేదెంత..? ప్రభుత్వానికి జమయ్యేది ఎంత అంటూ ప్రశ్నించారు. 2025 వరకూ మందుబాబులను తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు చేసిందని.. అదానీ డిస్టలరీస్ ఎవరిదన్నారు. కల్తీ మద్యాన్ని ప్రజలకు సరఫరా చేస్తున్నారని.. ఎవరైనా మందు తాగడం మానేస్తే.. తాగేంత వరకు పోలీసులు మందుబాబులను చితక్కొట్టే పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు. లోన్ యాప్ ఆగడాల తరహాలో మందుబాబులు పోలీసుల బారిన పడే ప్రమాదం కన్పిస్తోందని.. మేనిఫెస్టోలో చెప్పింది ఒకటైతే.. అసలు మద్య నిషేధం అనే మాట అనలేదని మంత్రులు అంటున్నారని విమర్శించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM