వైసీపీ నేతపై సీఐడీకి ఫిర్యాదు చేసిన టీడీపీ

by సూర్య | Sat, Aug 06, 2022, 03:29 AM

రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు యుద్దవాతావరణం సాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై సీఐడీకి ఫిర్యాదు అందింది. వైఎస్సార్‌సీపీ నేత, గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి, మరో ఎంపీలపై సీఐడీ ఏడీజికి టీడీపీ నేత వర్ల రామయ్య కంప్లైంట్ చేశారు. టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ నేతలు సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేశారని.. రెండు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంచడమే దేవేందర్ రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తుంది అన్నారు.


సోషల్ మీడియాలో దేవేందర్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ప్లాట్ నెం. 3, రోడ్ నంబర్. 12, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్ నుంచి నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్నారు. ఆగస్టు 3న వైఎస్సార్‌సీపీ ఎంపీ సైతం టీడీపీ నేతల హత్యారాజకీయాల పేరుతో తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్నారు.


అనంతరం ఆగస్టు 3న టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు దీనిపై పిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ సి.ఐ భూషణంని సంప్రదించగా.. ఆయన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారన్నారు. సీఐ తన ప్రాథమిక బాధ్యతలను విస్మరించి తమ పార్టీ నేతలపై అసభ్యకరంగా దుర్భాషలాడారని ఆరోపించారు. మీడియాతో కూడా మాట్లానివ్వకుండా వారిని బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించారన్నారు. ఇప్పటి వరకు తమ ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు.


అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదన్నారు వర్ల రామయ్య. అధికార పార్టీ నేతలపై అనేకసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న దేవేంద్ర రెడ్డి, ఎంపీలపైకఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు సి.ఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు.

Latest News

 
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM
మురుగునీరు వెళ్లడానికి దారి లేక కాలనీలో అవస్థలు Fri, Mar 29, 2024, 02:50 PM
ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాం Fri, Mar 29, 2024, 02:47 PM