పార్లమెంటులో ఆసక్తికర ప్రైవేటు బిల్లులు పెట్టిన విజయసాయిరెడ్డి

by సూర్య | Fri, Aug 05, 2022, 11:12 PM

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌లో మూడు ప్రైవేట్ బిల్లులను ప్ర‌తిపాదించారు. దేశంలోని ఏదేని రాష్ట్రానికి ఒక‌టి అంత‌కంటే ఎక్కువ రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేసే అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కే క‌ట్ట‌బెట్టేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉంది. ఇక రెండో బిల్లు విష‌యానికి వ‌స్తే... రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వులు స‌హా ఇత‌ర రాజ్యాంగబ‌ద్ధ ఎన్నిక‌ల్లో పాలుపంచుకునేలా ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు త‌ప్ప‌నిస‌రిగా బెయిల్ ఇవ్వాల‌ని రెండో బిల్లులో సాయిరెడ్డి ప్ర‌తిపాదించారు.


ఇక మూడో బిల్లు విష‌యానికి వ‌స్తే... అస‌త్య వార్త‌లు ప్ర‌చురించే మీడియా సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స‌ర్వాధికారాలు క‌ట్టేబెట్టేందుకు ఉద్దేశించిన మ‌రో బిల్లును సాయిరెడ్డి ప్ర‌తిపాదించారు. అంతేకాకుండా డిజిట‌ల్ మీడియాను కూడా ప్రెస్ కౌన్సిల్ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని సాయిరెడ్డి ప్ర‌తిపాదించారు. ఈ బిల్లులో "ఆల్ బ‌యాస్‌డ్ న్యూస్" వార్త‌లు ప్ర‌సారం చేసే ఛానెళ్లు అంటూ పేర్కొన్న ఆయ‌న వాటిని "ఏబీఎన్ ఛానెల్స్‌"గా పేర్కొన్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM