by సూర్య | Fri, Aug 05, 2022, 04:26 PM
ఏదైనా కేసులో విచారణ ఎదుర్కొంటూ కస్టడీలో ఉన్నా లేదా అరెస్టైన పార్లమెంట్, అసెంబ్లీ సభ్యుడు రాష్ట్రపతి లేదా ఉప రాష్ట్రపతి ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
అలానే న్యూస్ ఛానళ్ళు, డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారాల్లో వెల్లువెత్తుతున్న నకిలీ వార్తలను కట్టడి చేస్తూ వార్తా ప్రసారంలో ఆయా సంస్థలు పారదర్శకతను, నైతిక బాధ్యతను వహించేలా నియంత్రించే అధికారం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కట్టబెట్టే ఉద్దేశంతో చట్ట సవరణ కోరుతూ ఎంపీ విజయసాయి రెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు.
Latest News