by సూర్య | Thu, Jun 23, 2022, 08:28 PM
ఏపీలోని ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సా.6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వైసీపీ తరపున మేకపాటి విక్ర౦రెడ్డి, బీజేపీ తరఫున భరత్ కుమార్ తో పాటు మొత్తం 14 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. జూన్ 26న కౌంటింగ్ జరగనుంది.
Latest News