మానసాదేవి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం

by సూర్య | Thu, Jun 23, 2022, 07:13 PM

వరికుంటపాడు మండలం తూర్పు రొంపిచర్ల గ్రామంలో వెలసివున్న శ్రీ మానసా దేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త యజ్ఞేశ్వర రావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ శ్రీ మానసా దేవి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.


ఈ ఉత్సవాలు చల్లా వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. శుక్రవారం ఉదయం నుంచి గణపతి పూజ, స్వస్థ పుణ్యాహవాచనము, నవగ్రహ మండపారాధన, ఉత్సవ మూర్తులకు నవగ్రహములకు మహా స్నపనము, పంచామృతాభిషేకం తీర్థ ప్రసాదం 25వ తేదీ చండీ హోమం శ్రీ మానసా దేవి, శ్రీ సూక్త సర్వ సూక్త తాళ హోమంలు, సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం 26వ తేదీ వాల్మీక పూజ సహస్ర నామార్చన కుంకుమ పూజ పొంగళ్ళు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM