by సూర్య | Thu, Jun 23, 2022, 03:58 PM
విజయనగరం జిల్లా, పెద మానాపురం పీఎస్ పరిధిలో జూన్ 22న పోర్లి గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 7గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 35,520/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలానే కొత్తవలస మండలం మూసిరాం గ్రామ శివార్లలో జూన్ 22న కొత్తవలస ఎస్ఐ మరియు సిబ్బంది రైడ్ నిర్వహించి, నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే వారిని చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. మంచి నడవడిక నడవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంది అని తెలియజేసారు.
Latest News