పోలింగ్ ప్రారంభం..26న ఓట్ల లెక్కింపు
by సూర్య |
Thu, Jun 23, 2022, 09:16 AM
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా ఈ ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్.చక్రధర్బాబు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ నెల 26వ తేదీన ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంది. వైసిపీ తరపున మేకపాటి విక్రమ్రెడ్డి, బీజేపీ తరపున జి.భరత్కుమార్ యాదవ్ తో పాటు మరో 14 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. 279 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగనుంది.
Latest News