ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుదల..20వ తేదీ గడువు

by సూర్య | Thu, Jun 23, 2022, 12:04 AM

ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలోని విశ్వ‌విద్యాల‌యాల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ బుధ‌వారం రాత్రి విడుద‌లైంది. క‌డ‌ప‌లోని యోగి వేమ‌న విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ సూర్య క‌ళావ‌తి ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 145 కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థుల‌కు ప్రవేశం ల‌భించ‌నుంది. ద‌ర‌ఖాస్తుల‌కు జులై 20వ తేదీని గ‌డువుగా నిర్ణ‌యించారు. ఆ త‌ర్వాత ఆగ‌స్టు 17 నుంచి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా రాష్ట్రంలోని 16 విశ్వ‌విద్యాల‌యాల్లో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. 

Latest News

 
రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే కలిశాము Fri, Mar 29, 2024, 11:43 AM
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM