by సూర్య | Wed, Jun 22, 2022, 11:49 PM
శివసేన పార్టీని నడిపేందుకు తాను పనికిరానని చెపితే తాను తప్పుకుంటానని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అధికారం కోసం తాను పాకులాడటం లేదని చెప్పారు. గత 30 ఏళ్లుగా తాము కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించామని.. అయితే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనను సీఎం బాధ్యతలను తీసుకోవాలని కోరారని తెలిపారు. తనకు కాంగ్రెస్, ఎన్సీపీలు పూర్తిగా సహకరించాయని. ఇప్పుడు ఆ పార్టీలు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.
శివసైనికుడు ఎవరైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చని ఉద్ధవ్ థాకరే అన్నారు. తాను నమ్మక ద్రోహానికి గురయ్యానని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వ్యతిరేకించడంతో షాక్ కు గురయ్యానని తెలిపారు. రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ కు తెలిపానని అన్నారు. చర్చలకు రావాలని ఏక్ నాథ్ షిండే, రెబెల్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు.
Latest News